టీడీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి చాలా పెద్ద మనసును చాటుకున్నారు.. ఈ నిర్ణయంలో భాగంగా ఎన్నికలకు ముందు తాను ప్రచారానికి వినియోగించిన సొంత కారును ఏకంగా శిరీషా దేవి అంబులెన్స్ గా మార్చేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ” తనని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే నా కారును అంబులెన్స్ గా మార్చాను.
కాకినాడ,రాజమండ్రి,నర్సీపట్నం ఆస్పత్రుల్లో మృతి చెందిన వారిని నియోజకవర్గానికి తీసుకొచ్చేందుకు ఈ అంబులెన్స్ ను ఉపయోగించనున్నారు. అంబులెన్స్ నిర్వహణకు నా సొంత డబ్బులు ఇస్తాను అని ఆమె తెలిపారు.
