పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ

 పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ

Results released..!

Loading

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లాకు చెందిన నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పదో తరగతి తెలుగు పేపర్ లీకైన సంగతి తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 6గుర్ని నల్గోండ సీసీఎస్ నుండి నకిరేకల్ జడ్జ్ ముందు పోలీసులు హాజరు పరిచారు.

నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఏ1 చిట్ల అకాశ్ , ఏ2 బండి శ్రీనివాస్ ,ఏ3 చిట్ల శివ, ఏ4 గునుగుంట్ల శంకర్ ,ఏ5బ్రహ్మదేవర శంకర్ ,ఏ6 మైనర్ బాలుడ్ని నకిరేకల్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచగా రిమాండ్ కు ఆదేశాలిచ్చారు. మిగతా ఐదుగుర్ని కస్టడీలోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంలో ఇదే జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సదరు ఎమ్మెల్యే పీఏ గౌతమి హైస్కూల్ అనే ప్రైవేట్ స్కూల్ యజమాని అయిన ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ గునుగుంట్ల శంకర్‌తో డీల్ మాట్లాడుకొని ఎక్కువ మార్కులు, ర్యాంకులు రావడం కోసం సదరు ఎమ్మెల్యే పీఏ తెలుగు పేపర్ ను లీకు చేశారని ఆ వార్తల సారాంశం. ఈ కేసు విచారణలో ఉంది కాబట్టి మున్ముందు చూడాలి మరెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో..!

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *