మహిళలపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

 మహిళలపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు .. సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురించి మాట్లాడుతూ ” నన్ను మా ఇంటికి వచ్చి మరి తమ్మీ కాంగ్రెస్ పార్టీలోకి రండి..

మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను పార్టీలో చేరగానే అక్క బీఆర్ఎస్ లో చేరారు.. పదవులు తీసుకోని అనుభవించారు.. మీ వెనక ఉన్న అక్కల మాట వింటే మీరు జూబ్లీహిల్స్ బస్టాండ్ లో అడుక్కోవడమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ ” కాంగ్రెస్ లో ఎవర్కి మహిళలంటే గౌరవం లేదు.. సాక్షాత్తు ముఖ్యమంత్రే అలా మాట్లాడటం తప్పు.. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని” డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *