రేవంత్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ స్టార్ క్యాంపైనరా..?

హైదరాబాద్ మార్చి 7 (సింగిడి)
గతంలో జరిగిన 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారైంది.ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అపజయాలే ఎదురవు తున్నాయి. రేవంత్ రెడ్డి ఎక్కడ బాధ్యత ,తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పనిఖతం అవుడతుంది. అందుకు సంబందించి కొన్ని ఉదాహరణలు చూద్దాం..
ఎంపీ ఎన్నికలలో మహబూబ్నగర్, మల్కాజిగిరిలో బాధ్యత తీసుకుంటే అక్కడ లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. హిమాచల్ ప్రదేశ్ లో ఇంచార్జ్ గా బాధ్యత తీసుకుంటే అక్కడ బీజేపీ గెలిచింది. మహారాష్ట్ర లో బాధ్యత తీసుకోగా అక్కడా బీజేపీ గెలుపొందింది..
ఢిల్లీ లో స్టార్ క్యాంపెయినర్ గా వెల్తే అక్కడ కాంగ్రేస్ తుడిచిపెట్టుకుపోయి బీజేపీ గెలుపొందింది. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల కోసం ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి హోదాలో క్యాంపెయిన్ చేస్తే అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు..
రేవంత్ రెడ్డి వెల్లిన ప్రతీచోట బీజేపీ విజయాన్ని సాధిస్తుండటంతో ఇంట బయట పార్టి నేతలు రేవంత్ రెడ్డిపై తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డి ఓడినా మాకు నష్టమేమి లేదని ప్రచారంలో అనడం వల్లే ఆయన ఓడిపోయారని క్యాడర్ లో చర్చ నడుస్తుంది.బీజేపీ కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నాయి.ఈ వాఖ్యల్లో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
