ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినోడే రేవంత్ రెడ్డి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది క్లైమాక్స్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినవాడు గోప్పోడు అని. ఈ డైలాగ్ పక్కగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సూటవుతుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒంటికాలుపై లేచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి సమావేశంలో కూల్ అయ్యారని సినీ పెద్దలు గుసగుసలాడుతున్నారు. అప్పట్లో మంత్రి సురేఖ అక్కినేని కుటుంబం గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీ అంతా ఏకమై దాన్ని ఖండించారు.
ఆ తర్వాత సినీ పెద్దలు కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏడాది అయిన ఎవర్ని కలవకపోవడం.. సాక్షాత్తు ముఖ్యమంత్రి కి విషెష్ చేయలేదు.. ఓ ఫంక్షన్ లో హీరో అల్లు అర్జున్ తన పేరు మరిచిపోవడంతోనే చిన్న సంఘటనను పెద్దదిగా చేసి అరెస్ట్ చేశారు.. కావాలనే దీనిని ఇష్యూ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సినీ ఇండస్ట్రీ ఖండించలేదని రేవంత్ రెడ్డే వాళ్ల ముందట వాపోయారట. కానీ నిన్నటి భేటీలో అలాంటి విభేధాలు కానీ కోపతాపాలు కానీ ఏమి లేవన్నట్లు రేవంత్ & మంత్రి వర్గ సభ్యులు ప్రవర్తించారు అంట. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీని కూడా ఫార్మా ఐటీ తరహాలోనే అభివృద్ధి చేస్తాము.
అన్ని విధాలుగా అండగా ఉంటాము. కాకపోతే మీరు మా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారంట. అంతేకాకుండా ఇప్పుడు సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న హీరోలంతా నా కండ్లముందే పెరిగారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్,రానా లాంటి హీరోలతో నాకు మంచి సన్నిహిత్యం ఉందని చెప్పడంతో ఇండస్ట్రీ కాంగ్రెస్ సర్కారుల మధ్య ఉన్న విబేధాలు తాత్కాలికంగా ముగిసినట్లే అని సినీ రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. అయిన ఇదంతా కేవలం ఏడాదిగా ఇండస్ట్రీ కాంగ్రెస్ సర్కారును పట్టించుకోకపోవడమే కారణం.. ఇది టీ కప్ లో తుఫాన్ లాంటిది. అయిన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినవాడే రేవంత్ రెడ్డి అని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
