మరోసారి వార్తల్లో రాజా సింగ్.. ఈసారి ఏకంగా..!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ ” పార్టీలో ఉన్న చెత్తంతా బయటకు పోవాలి. పాతతరం నాయకులంతా బయటకు వెళ్లి.. కొత్తతరం నాయకులు వస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది.
ఇక్కడ ఉన్న కొంత మంది నాయకులు ఎవరూ అధికారంలో ఉంటే వాళ్లకు వంతు పాడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం గురించి ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడ్ని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే అతను కేవలంరబ్బర్ స్టాంప్గా ఉంటాడు.
అదే జాతీయ నాయకత్వంలోని కమిటీ నియమిస్తే బాగుంటుందన్నారు, ఇన్నాళ్ళుగా గతంలో ఎవరు అధ్యక్షు డు అయితే వారు గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారు.గతంలో బీజేపీ అధ్యక్షులు కార్యకర్తల్ని,సీని యర్ నాయకులను తొక్కేశారు.బీజేపీ కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగులు, ముఖ్యమంత్రితో బ్యాక్ డోర్ మీటింగులు పెట్టకూడదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
