తెలంగాణలో మహిళలకు భద్రత కరువు

 తెలంగాణలో మహిళలకు భద్రత కరువు

చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ జిల్లాకు చెందిన యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న జనగాం జిల్లా గంగాపూర్ కు చెందిన బండారం స్వామి(29)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో బండారం స్వామి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తాను సికింద్రాబాద్లోని పార్క్ వద్ద ఓ హోటల్లో ఉన్నట్లు ఆ యువతికి చెప్పాడు.స్వామిని కలవడానికి ఆ యువతి రాయ్‌పూర్ నుంచి సికింద్రాబాద్లోని హోటల్ కు వచ్చింది.

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ యువతి పై అత్యాచారం చేశాడు స్వామి..అనంతరం తన తండ్రికి ఆరోగ్యం సరిగ్గ లేదని యువతిని పంపించేశాడు.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బండారం స్వామి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి శ్రీలంక మీదుగా ఆస్ట్రేలియా వెళ్లే విమానాన్ని ఎక్కాడు.

అప్పటికే మోసపోయినట్లు గ్రహించిన యువతి ఈనెల 28న రాయ్‌పూర్ లోని విధాన్ సభ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది.వారు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సంఘటన జరిగిన నగర కమిషనరేట్ పరిధిలోని మహాకాళి పోలీస్ స్టేషన్ కు కేసును ట్రాన్స్ఫర్ చేశారు.రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇమ్మి గ్రేషన్, సీఐఎస్ఎఫ్ అధికారులు సహకారంతో విమానంలో ఉన్న స్వామిని అరెస్ట్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *