గంజాయి మత్తులో దించి సహచర విద్యార్థినిని

 గంజాయి మత్తులో దించి సహచర విద్యార్థినిని

ఏపీ లోని తిరుపతి – శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ చదువుతున్న కర్నూల్ జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి(22)కి సహచర విద్యార్థిని ప్రణవకృష్ణ(35)తో స్నేహం ఏర్పడింది.

ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్ రెడ్డి కూడా ఎల్ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.. అయితే ఆ అమ్మాయికి ప్రణవకృష్ణకి స్నేహం ఏర్పడడంతో తరచూ ప్రణవకృష్ణ ఇంటికి వెళ్లేది.

ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్ రెడ్డిలు గంజాయికి అలవాటై ఆ యువతికి కూడా గంజాయి అలవాటు చేశారు.. ఇలా ఆ యువతి గంజాయి మత్తులో ఉండగా కృష్ణకిషోర్ రెడ్డి ఆ యువతిని అత్యాచారం చేశాడు. దీన్ని కృష్ణకిషోర్ రెడ్డి భార్య ప్రణవకృష్ణ వీడియోలు తీసి ఆ యువతిని బెదిరించి నగదు, నగలు తీసుకున్నారు.

ఆ తర్వాత ఆ యువతి తమ్ముడికి, ఆ యువతిని పెళ్లి చేసుకునే అబ్బాయికి ఈ వీడియోలు పంపి డబ్బులు డిమాండ్ చేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ భార్యభర్తలను అరెస్ట్ చేయగా, విశ్వవిద్యాలయం వాళ్లు ఇద్దరిని సస్పెండ్ చేశారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *