జీతాలివ్వలేని స్థితిలో పీసీబీ

 జీతాలివ్వలేని స్థితిలో పీసీబీ

Pakistan Cricket Board

Loading

తమ దేశం తరపున క్రికెటర్లకు సైతం జీతాలు ఇచ్చుకోలేని స్థితికి చేరిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా బోర్డు సభ్యులు కెప్టెన్సీలో తరచూ మార్పులు చేస్తున్నారు…

వరుసగా జట్టుకు ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి జాతీయ జట్టు ఆటగాళ్లకు నాలుగు నెలలుగా జీతాలివ్వట్లేదు.

పురుషుల జట్టుకే కాదు, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుకు కూడా నాలుగు నెలల జీతం బకాయి ఉంది. మొత్తం 25 మంది సీనియర్ పురుషుల క్రికెటర్లకు జులై 1, 2023 నుంచి జూన్ 30, 2026 వరకు మూడేళ్లపాటు కాంట్రాక్టులు లభించాయి. అయితే జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కాంట్రాక్టులపై సమీక్ష జరిగినట్లు కూడా పాక్ మీడియా నివేదించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *