సారీ చెప్పిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan Deputy CM Of Andhrapradesh
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి క్షమాపణలు చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆందోళనలను చేపట్టారు.
దీంతో వైసీపీ సభ్యులు సభలో చేసిన ఆందోళనపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అసెంబ్లీ లోపల బయట ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే పాలసీ టెర్రరిజం గుర్తుకువస్తుంది.
గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్కాట్ చేయడం దురదృష్టకరం. వైసీపీని ఐదేళ్లు తట్టుకుని నిలబడిన ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు హ్యాట్సాఫ్ అని ఆయన అన్నారు.