మంత్రివర్గ విస్తరణలో 4గురికే చోటు..!

Only 4 places left in the cabinet expansion..!
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉగాది పండుగ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగనున్నది. దీనికి సంబంధించిన రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది.
ఏప్రిల్ 3న కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.