తెలంగాణలో కొత్తగా పబ్లిక్ స్కూళ్లు

 తెలంగాణలో కొత్తగా పబ్లిక్ స్కూళ్లు

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి మండలానికి మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమీషన్ సిఫార్సు చేసింది.

ఈ మేరకు ఈ ఏడాది ఫైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మంచాల, ఆరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు , పొల్కంపల్లిలో ఈ నాలుగు పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉండే ఈ స్కూళ్ళ ఏర్పాటుకోసం ఒక్కొక్కదానికి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నది. అయితే, ఒక్కొక్క స్కూళ్లల్లో 1,500- 1,800 మందికి అడ్మిషన్ లభించనున్నది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *