హారీష్ రావు పై నెటిజన్లు ప్రశంసల జల్లు..ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ వర్గ ఆటో కార్మికుల సమావేశంలో పాల్గోన్నారు..ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” సిద్దిపేట ఆటో సొసైటీ దేశానికే ఆదర్శం..2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం..అవసరం ఉన్న వారికి తక్కువ వడ్డీ కి ఋణం అందిస్తున్నాం..ఇప్పటివరకు2 కోట్ల 10 లక్షల రుణాలు ఇచ్చాము.
.26 మంది ఆటో కార్మికులు చనిపోతే 2 లక్షల ఎక్సగ్రెషియా ఇవ్వడం జరిగింది అని అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ చాలా మంది గుట్కా..సిగరేట్..మందుకు అలవాటు పడుతున్నారు..అలవాటే కాదు వాటికి అందరూ బానిసవుతున్నారు..ఆటోకార్మికులు రోజంతా డ్రైవింగ్ చేసి సంపాదించిన సంపాదనంతా వీటికోసమే ఖర్చు చేస్తున్నారు..మీకడుపు చూస్కోవడం కాదు..మీకోసం ఎదురుచూసే మీ ఇల్లాలి గురించి..మీ కడుపున పుట్టినవాళ్ల గురించి ఆలోచించండి..
తాగి మీరు చనిపోయిన..అనారోగ్యానికి గురైన వారి పరిస్థితి ఏంటనేది ఆలోచించండి.ఇవన్నీ ఈరోజు నుండే వదిలేయండి..ఆనందంగా మీకుటుంబంతో జీవించండి ..మన ఇల్లు మనమే చక్కదిద్దుకోవాలి అని అన్నారు..ఈ వ్యాఖ్యలు కేవలం ఆటోకార్మికులనే కాదు గుట్కా సిగరేట్ మందు అలవాటున్న ప్రతోక్కర్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి..మిగతా వారికి సూచనలు సలహాలుగా ఉన్నాయని నెటిజన్లు మాజీ మంత్రి హారీష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
