ఈటలకు తుమ్మల కౌంటర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం అనుమతి కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతకం చేశారు. కాళేశ్వరం క్యాబినెట్ ఉమ్మడి అంశం పరిధిలోనిది అని ప్రస్తుత మల్కాజీగిరి బీజేపీ ఎంపీ, నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరం కమీషన్ కు నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే.
ఈ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందిస్తూ ” ఈటల రాజేందర్ పై నాకు గౌరవం ఉంది. ఎందుకు ఇలా వ్యాఖ్యానించారో నాకు తెలియదు. ఇది తెలిసిన క్షణమే నాకు బాధేసింది. కాళేశ్వరం అనుమతి కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయలేదు.
కాళేశ్వరం అనుమతి వచ్చాక తర్వాత ప్రాజెక్టుల కోసం సబ్ కమిటీ వేశారు.కమీషన్ వివాదంలోకి తుమ్మలను ఎందుకు లాగాల్సి వచ్చిందో ఈటల సమాధానం చెప్పాలి. తుమ్మల కూడా కాళేశ్వరంపై సబ్ కమిటీ నివేదికపై సంతకం చేశారని ఈటల అనడం బాధాకరం ” అని ఆయన పేర్కొన్నారు.
