HCU విద్యార్థులను అవమానించిన మంత్రి పొంగులేటి..!

Key announcement on Indiramma houses
డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అడుగు భూమి కూడా తమ ప్రభుత్వం తీసుకోదు. గత ప్రభుత్వ పెద్దలు ఒక టీమ్ ను హెచ్ సీయూకి పంపి ఉద్యమాలు.. ధర్నాలు చేయిస్తున్నారు. ఓ ఫెయిడ్ బ్యాచ్ అక్కడ అరాచకం సృష్టిస్తుంది.
గతంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు ఆ యూనివర్సిటీకు భూములను అప్పజెప్పారు. రెండు దశాబ్ధలుగా కోర్టులో పెండింగ్ లో యూనివర్సిటీకి సంబంధం లేని నాలుగోందల ఎకరాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నాము. ఐటీ.. ఐటీయేతర కంపెనీలను అక్కడ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాము.
బీఆర్ఎస్ బీజేపీ మాయలో పడి విద్యార్థులు ఆగం కావోద్దు. మీఅందరికి మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు సంబంధించిన భూమిలో అడుగు కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్కుంటాము అని అన్నారు. మంత్రి పొంగులేటి చేసిన ఫెయిడ్ బ్యాచ్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి పొంగులేటి హెచ్ సీయూ విద్యార్థులను.. వారి పోరాటాలను అవమానిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.
