తొలి స్పీచ్ తోనే టీకాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పుట్టించిన మీనాక్షి..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్గా మీనాక్షి నటరాజన్ నిన్న శుక్రవారం చాలా సాధారణంగా ఈ నేలపైకి అడుగు పెట్టారు. ఇప్పటివరకూ ఎవరూ కూడా రానీ ఎవరూ ఊహించని విధంగా మీనాక్షి నటరాజన్ సింపుల్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ చాలా స్ట్రిక్ట్గానే కనిపిస్తున్నారు. ఏకంగా వచ్చీరావడంతోనే తన తొలి స్పీచ్ తోనే కాంగ్రెస్ పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. ఇటు సీఎం సారూ కూడా పార్టీ విషయంలో ఇక సీరియస్గానే ఉంటానంటున్నారు.
మీనాక్షి నటరాజన్ ఎలాంటి హంగూలేదు.. ఏ ఆర్భాటమూ లేదు. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగు… వీపున చిన్న లగేజీ బ్యాగు…స్పెషల్ ఫ్లయిట్ లేదు.. కాన్వాయ్, సెక్యూరిటీ అసలే లేదు. ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలా హైదరాబాద్లో దిగారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చీ రావడంలోనే తన మార్క్ ఏంటో చూపించారు. ఫ్లెక్సీలకు ఫోజులిస్తే కాదు… ప్రజల్లో ఉంటూ సిన్సియర్గా పని చేయాలన్నారు. పైరవీలు చేయడం కాదు… ఆ ఆలోచనే మైండ్ నుంచి తీసేయాలన్న హింట్ ఇచ్చారు. గ్రౌండ్ లెవల్లో పనిచేసేవారికే పదవులు వస్తాయని క్లిస్టర్ క్లియర్గా చెప్పేశారు.
మనిషి సాఫ్ట్గా కనిపించినప్పటికీ… పార్టీ విషయంలో వెరీ సీరియస్ అని తెలిసేలా ఫస్ట్ స్పీచ్తోనే అదరగొట్టారు హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే… పార్టీ వ్యవహారాలపై ఆరా తీశారు మీనాక్షి. పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్టు గుర్తించారు. సీనియర్, జూనియర్ తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. విభేదాలు, వివాదాలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నా ఆమె… కష్టపడ్డ ప్రతిఒక్కరిని గుర్తిస్తామని స్పష్టం చేశారు.మొత్తంగా… కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందో లెక్క ఇప్పుడో లెక్క ఉంటుందంటున్నారు నేతలు. మరి కొత్త ఇన్చార్జ్ రాకతో మున్ముందు పార్టీ ఎలా ఉండబోతోంది…? ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి…
