ఊరి మొత్తంలో ఇద్దరికే రుణమాఫీ- రేవంత్ సర్కారు ఘనత..!

Revanth Reddy is a joker.. a paper tiger..!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ కు చెందిన కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు కూనంనేని సాంబశివ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు చాలా గ్రామాల్లో రైతులకు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ చెప్తున్నది.
అయితే శుక్రవారం సభలో బడ్జెట్ ప్రసంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రుణమాఫీ క్షేత్రస్థాయి పరిస్థి తిని వివరిస్తూ జనగాం జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన ముదిగొండ అనే ఓ గ్రామాన్ని ఉదహరించారు. ఆయన మాట్లాడుతూ ముదిగొండ అనే గ్రామంలో మొత్తం 554 మంది రైతులు ఉన్నారు.
కానీ ఈ మొత్తం రైతుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే రుణమాఫీ జరిగిందని ఆయన చెప్పారు. అధికారులు చిన్నచిన్న సాకులు చూపుతూ రుణమాఫీ చేయలేదని తెలిపారు. ఆధార్ కార్డుల ఎంట్రీని తప్పుగా చూపి, ఇంతమందికి అన్యాయం చేశారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునఃపరి శీలించాలని డిమాండ్ చేశారు. ఇక రూ.2లక్షల కు పైగా రుణాలు ఉన్నవాళ్ల సంగతి చెప్పా ల్సిన అవసరం లేదని వాపోతూ తప్పులను సరిచేయాలని కోరారు.
