తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కీలక పరిణామం..!

Revanth Reddy Anumula
ఈనెల మూడో తారీఖున తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు చెందిన ప్రతినిధులకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరారు.
కుల సామాజిక వర్గాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్ లకు జానారెడ్డి లేఖ రాశారు.ఈ క్రమంలో మంత్రి పదవి రేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు.
వీరితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 స్థానాల్లో 4 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి ( ఇబ్రహీంపట్నం), ప్రసాద్ కుమార్ (వికారాబాద్), రామ్మోహన్ రెడ్డి (పరిగి), మనోహర్ రెడ్డి (తాండూరు) పోటీ పడుతున్నారు. త్వరలో జరగబోయే విస్తరణలో తమ నలుగురిలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను ఈ ఎమ్మెల్యేలు కల్సినట్లు సమాచారం.
