పెద్దగట్టు జాతరలో ఎమ్మెల్సీ కవిత.!

సూర్యాపేట జిల్లా పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ చౌడమ్మ తల్లికి బోనాన్ని సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతి పెద్ధదైన లింగమంతుల జాతర తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తుంది.
కేసీఆర్ గారి హయాంలో జాతరకు రూ.14 కోట్ల నిధులు కేటాయించి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వం కూడా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను అని అన్నారు..
