ఏపీ ప్రభుత్వంపై కల్కి మూవీ తరహా కుట్రలు

 ఏపీ ప్రభుత్వంపై కల్కి మూవీ తరహా కుట్రలు

ఏపీ ప్రభుత్వంపై కల్కి మూవీ తరహా కుట్రలు జరుగుతున్నాయి అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలైన సమయం ఇవ్వడం లేదు..

కల్కి మూవీలో కాంప్లెక్స్ లో కూర్చుని కమాండర్ కుట్రలు చేసినట్లు ఏపీలో ఓ కాంప్లెక్స్ లో కూర్చుని సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఒకప్పుడు ఎక్కడ శవం కన్పించిన ఆ శవం మాదే అని అనేవారు. ఇప్పుడు ఎక్కడ మర్డర్ జరిగిన అది టీడీపీ వాళ్లు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు..

ఈ కుట్రలను కుతంత్రాలను చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పసిగట్టాలి. ఐదేండ్లలో జే బ్రాండ్ల వల్ల చాలా మంది నకిలీ మద్యం తాగి అనారోగ్యానికి గురై ప్రాణాలను వదిలారు. కొన్ని లక్షల మంది ఆర్థికంగా చితికిపోయారు. మద్యం పై జే ట్యాక్స్ వల్ల లక్షల కోట్లు వెనకేసుకున్నారు.. వీటిన్నింటిని రికవరీ చేయాలని “ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *