జగన్ మీడియా సమావేశం.. ఎందుకంటే…?
వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు శుక్రవారం మధ్యాహ్నాం మూడు గంటలకు అమరావతిలో మీడీయా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కిస్తోన్న తిరుపతి తిరుమల లడ్డూ వివాదంపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు.. ఎమ్మెల్యేలు అంతా మీడియా సమావేశంలో తిరుమల తిరుపతి లడ్డూ లో జంతువుల కొవ్వు కలుపుతున్నట్లు తెగ మీడియా ప్రకటనలు చేస్తున్నారు.. ప్రస్తుతం వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుసంచలనం సృష్టిస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించనున్నారు సమాచారం.. ఐదేండ్ల పాలనలో ఎన్నో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. తిరుమల తిరుపతిని అత్యంత పవిత్రంగా చూశాము.. టీడీపీ కూటమి ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమే తప్పా అందులో వాస్తవం లేదని వైసీపీ నేతలు.. మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇప్పటికే క్లారీటీస్తున్నారు. తాజాగా జగన్ మీడియా సమావేశం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.