సీఎం రేవంత్ సోదరుడికి “హైడ్రా” నోటీసులు

Anumula Tirupati Reddy
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో హైడ్రా తన దూకుడుని మరింత పెంచింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డికి సంబంధించిన మాదాపూర్ లోని అమర్ కోఅపరేటివ్ సోసైటీలోని ఆయన ఇంటికి “హైడ్రా” నోటీసులు పంపింది.
తిరుపతి కొన్న ఇల్లు FTL పరిధిలో ఉందని అధికారులు గుర్తించారు. దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ,డాక్టర్ కాలనీ,అమర్ సోసైటీ వాసులకు నోటీసులు జారీ చేసింది. నెలలోగా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ఆదేశించింది..
హైడ్రా ఆదేశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందిస్తూ ” 2015లో అమర్ సోసైటీలో నివాసం కొన్నాను. అప్పుడు అది FTL పరిధిలో ఉన్నదని తెలియదు. ఆ పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు” అని అన్నారు.
