రామోజీ రావు మృతి పట్ల మాజీ మంత్రి హారీష్ రావు దిగ్ర్భాంతి

 రామోజీ రావు మృతి పట్ల మాజీ మంత్రి హారీష్ రావు దిగ్ర్భాంతి

రామోజీ రావు మృతిపట్ల మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సంతాపం తెలియజేశారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మృతి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు..

నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు గారు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం.

రామోజీరావు గారి కుటుంబానికి, రామోజీ సంస్థల ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *