హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట

 హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణరెడ్డి లు అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ పై డ్రోన్ లు ఎగురవేశారని భూపాలపల్లి జిల్లాలో కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే..

తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును అశ్రయించారు.దీనిపై విచారించిన హైకోర్టు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణరెడ్డి లపై నమోదైన ఎఫ్ఐఆర్ పై స్టే విధించింది..

తదుపరి విచారణను వచ్చే నెల సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు వాయిదా వేసింది.. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *