మద్యం ప్రియులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.!

Good news from the Revanth government for alcohol lovers!
తెలంగాణలోని మద్యం ప్రియులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఓ శుభవార్తను తెలపనున్నది.
అందులో భాగంగా రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.
అంతేకాకుండా తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మద్యం, బీరు కంపెనీలు కొత్త ఉత్పత్తులను సప్లయి చేయడానికి మార్చి 15 వరకు ఎక్సైజ్ శాఖ గడువు ఇచ్చింది. ఇప్పటి వరకు టీజీబీసీఎల్కు కొత్త కంపెనీల నుంచి 39 దరఖాస్తులు వచ్చాయి.. ఏప్రిల్ 2వ తేదీ వరకు గడవు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
