కౌలు రైతులకు శుభవార్త

Good news for tenant farmers
2 total views , 1 views today
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో చట్టాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రద్ధు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్ధు చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నేత.. మంత్రి కింజరాపు అచ్చెన్నయుడు ప్రకటించారు..
కౌలు రైతులకు మేలు చేసేలా త్వరలోనే మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వారు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో కౌలు రైతులను సభ్యులుగా చేర్చాలి.. వారికీ కూడా మాములు రైతుల లెక్క రుణాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
సహకార సంఘాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తాము.. అప్కాబ్ -డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళలకు అధిక శాతం రుణాలను అందించాలని ఆయన కోరారు…
