కూతురిపై కన్నేసిన తండ్రి…చివర్కి.?

 కూతురిపై కన్నేసిన తండ్రి…చివర్కి.?

3 total views , 1 views today

మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా నుండి బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వలసవచ్చిన నరేష్ దంపతులు. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేసిన తండ్రి నరేష్

బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంత పెట్టిన తండ్రి. తండ్రి కోరిక విని గట్టిగా అరిచిన బాలిక. తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బెదిరించిన బాలిక.పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన బాలిక తండ్రి బానోతు నరేష్.. తన కోరిక తీర్చాలంటూ బాలిక పై ఒత్తిడి తెచ్చిన తండ్రి నరేష్.. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చిన తండ్రి నరేష్.

నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య.. బాలికను హతమార్చి నిర్మానుష్య ప్రాంతం నుండి బయటకు వచ్చిన బాలిక తండ్రి నరేష్.వారం రోజుల తర్వాత బయటపడిన బాలిక మిస్సింగ్ మిస్టరీ.. ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం.. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు.

11 నిమిషాల వ్యవధిలోనే బాలిక ను హత్య చేసిన తండ్రి నరేష్.. అనంతరం అక్కడి నుండి బయటకు వచ్చిన నిందితుడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లిన నిందితుడు.వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూస్తూ వచ్చిన నిందితుడు.. తన కూతురు మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేష్ దంపతులు.

వారం రోజుల పాటు అస్సలు విషయం దాచిన బాలిక తండ్రి నరేష్. బాలిక తండ్రి నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్దారణ.నాలుగు బృందాలతో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400