సాగునీరు కోసం రైతులు ఆందోళన..!

RMPs and PMPs should not use the word “doctor”.
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా పరిధిలోని నెట్టెంపాడు లిఫ్ట్ కింద 104 ప్యాకేజీలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం గద్వాల-రాయచూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెట్టెంపాడు లిఫ్ట్ లోని 104 ప్యాకేజీ కింద సాగునీరు అందక ఇప్ప టికే వేల ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలకు మోటార్లు పెట్టి నీటిని వాడుకుంటు న్నారని వాపోయారు. దీంతో గువ్వలదిన్నె, వెంకటాపురం, కొండాపురం చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం లేదన్నారు. సాగు నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులు అక్కడికి చేరుకొని ఆఫీసర్లను కలవాలని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం కలెక్టరేట్ కు చేరుకొని నిరసన తెలిపారు. కెనాల్ పై ఇల్లీగ ల్ గా మోటార్లు ఏర్పాటు చేస్తున్నారని, దీంతో తమకు సాగునీరు అందడం లేదన్నారు. మోటార్ల ద్వారా నీటిని ఎక్కువగా తోడి వేయడంతో ఈ పరి స్థితి ఉందన్నారు. అనంతరం కలెక్టర్ సంతోష్ కు వినతిపత్రం అందజేశారు.
