మంత్రి అనుచరుల ఆగడాలతో వీడియో తీసుకుంటూ రైతు ఆత్మహత్య

 మంత్రి అనుచరుల ఆగడాలతో వీడియో తీసుకుంటూ రైతు ఆత్మహత్య

రైతు రాజ్యం వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వేస్తే నా పొలం ఆక్రమించుకొని నాకు అన్యాయం చేస్తున్నారని మ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి.

నేను చనిపోతున్న.. నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి.. డిప్యూటీ సీఎం బట్టి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ ఖమ్మం జిల్లా టీడీపీ కార్యర్త, ఓ రైతు ఆత్మహత్య.

రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని.. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా తెలియజేసిన మృతుడు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు ఆక్రమించుకున్నారని ఎమ్మార్వో, ఎస్సై ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్ నాకు ఆత్మహత్య శరణ్యమని పురుగుమందు తాగి మృతి చెందారు.


తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి చనిపోయాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *