ప్ర‌తి క్ష‌ణం… వ‌రంగ‌ల్ ప్ర‌గ‌తి కోసం తపన..

 ప్ర‌తి క్ష‌ణం… వ‌రంగ‌ల్ ప్ర‌గ‌తి కోసం తపన..

Loading

తెలంగాణ  రాష్ట్రంలో గ‌త పాల‌కులు సృష్టించిన విధ్వంసానికి… ప్ర‌స్తుతం మ‌నం ఎన్నో ఆర్థిక అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నామ‌ని… అయినా తాము రాష్ట్ర అభివృద్ధిలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్ జిల్లాలోని స్టేష‌న్ ఘ‌న‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి, ప‌లు శంకుస్థాప‌న‌లు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయన రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆడబిడ్డ‌ల‌ స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులు అందజేశారు. మహిళా శక్తి పథకం ద్వారా లబ్ధిదారులకు… ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ అందించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు.., సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ స‌భ‌లో మంత్రి సురేఖ ప్ర‌సంగిస్తూ… ప్ర‌తి క్ష‌ణం తెలంగాణ ప్ర‌జ‌లు, వ‌రంగ‌ల్ బిడ్డ‌ల కోసం సీఎం రేవంత‌న్న  ప‌రిత‌పిస్తున్నాడ‌ని చెప్పారు. అందుచేత‌, సీఎం రేవంత‌న్న‌కు  తాము అంతా అండ‌గా ఉంటామ‌న్నారు. వ‌రంగ‌ల్ ను సొంత ప్రాంతంలా చూస్తున్న సీఎం రేవంత‌న్న‌కు మంత్రి సురేఖ థ్యాంక్స్ చెప్పారు. గ‌త ప్ర‌భుత్వంలో స్టేష‌న్ ఘ‌న‌పూర్, వ‌రంగ‌ల్ జిల్లాలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశార‌ని ఆగ్ర‌హించారు.

అయితే, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక… వ‌రంగ‌ల్ ను త‌న సొంత ప్రాంతంలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. త‌న‌ స‌హ‌చ‌ర మంత్రి సీత‌క్క కూడా రాష్ట్రంలోని మ‌హిళా అభ్యున్న‌తికి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ర‌ని ప్ర‌శంసించారు. వ‌రంగ‌ల్ రెండోవ రాజ‌ధాని లాగా అభివృద్ధి చేయ‌డం త‌కెంతో సంతోషంగా ఉంద‌న్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *