రోజూ జొన్న రొట్టె తింటే సిక్స్ ప్యాక్ బాడీ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy’
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : రోజూ జొన్నరొట్టె తింటూ, ఎవరి దుస్తులు వాళ్లు ఉతుక్కుంటే ఆటోమాటిక్ గా సిక్స్ ప్యాక్ వస్తుంది. ఇప్పుడంతా ఏదో డైట్ అని చెబుతున్నారు. జిమ్ములకు వెళ్లి కండలు పెంచాల్సిన అవసరం లేదు. అచ్చంపేటలో దోసకాయలు బాగా పండిస్తారు.
దోసకాయ, కందిపప్పు కలిపి వండితే బ్రహ్మాండంగా ఉంటుంది. చికెన్ మటన్ కూడా పనికి రాదు. అప్పుడు ఆ రుచులే వేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నాడు ఇందిరమ్మ ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి పేదలకు భూములు పంచింది.
రైతులకు సాయం అందిస్తే అద్భుతాలను సృష్టిస్తారు. రైతన్నలకు అన్ని విధాలుగా ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది. పంట మార్పిడి జరిగి తీరాలి. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆయన అన్నారు.
