కాంగ్రెస్ పాలనలో దర్శకుడి భూమి కబ్జా..!

 కాంగ్రెస్ పాలనలో దర్శకుడి భూమి కబ్జా..!

Director’s land seized during Congress rule..!

7 total views , 7 views today

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ సానుభూతిపరుడి భూమికే రక్షణ కరువు అయిన సంఘటన ఇది. నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, గద్దర్‌తో కలిసి ఇంకెన్నాళ్ళు అనే సినిమాను తీశారు దర్శకుడు సయ్యద్ రఫీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎల్లమ్మ గుడికి సోదరభావంతో 4 ఎకరాల 4 గుంటల భూమిని దానం రఫీ అనే దర్శకుడు, తన నలుగురు సోదరులు చేశారు.

అయితే దర్శకుడు రఫీ ఇచ్చిన భూమి ప్రస్తుత విలువ దాదాపు రూ.32 కోట్లుగా పలుకుతుంది. తన భూమి పక్కన ఉత్తరం వైపు సర్వే నంబర్ 264లో 32 గుంటల తమ ప్రైవేట్ భూమిని ఆ గుడి ఈవో, ఇంకా కొందరు కలిసి ఎండోమెంట్ ముసుగులో కబ్జా చేస్తున్నట్లు రఫీ ఆరోపించారు.ఆ గుడి ఈవో ఇంకా కొందరు కలిసి, రెండో శనివారం, ఆదివారం రోజుల్లో రాత్రిపూట లైట్లు పెట్టి మరీ ఎండోమెంట్ ముసుగులో కబ్జా చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేశారు.

దీనిపై అధికారులకు కొండా సురేఖ ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకుండా పనులు చేస్తున్నారంట.హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్, ఎల్లమ్మ గుడి ఆలయ ఈవో కలిసి కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్న తరుణంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ దుశ్చర్యలను తక్షణమే నిలిపివేసి, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రఫీ, అతని సోదరులు డిమాండ్ చేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400