సిరిసిల్ల కాంగ్రెస్ లో విబేధాలు

Differences in Sirisilla Congress
సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో విబేధాలు బయటపడ్డాయి.. నియోజకవర్గ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడూతూ ” గత ఇరవై ముప్పై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నాము.
అధికారంలో ఉన్న లేకపోయిన పార్టీని నమ్ముకునే ఉన్నాము.. పార్టీ కష్టకాలంలో సైతం అండగా ఉన్నాము.. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సరే మాలాంటి నాయకులకు.. కార్యకర్తలకు న్యాయం దక్కడం లేదు..
ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులను,కార్యకర్తలను చిన్నచూపులు చూస్తున్నారు. ఇతర పార్టీల నుండి చేరినవారికి మార్కెట్ కమిటీల్లో పదవులిస్తున్నారు. ముందు నుండి ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారు అని వారు ఆరోపించారు.