ఫిరాయింపుల ఎమ్మెల్యేలు యూ టర్న్..?

 ఫిరాయింపుల ఎమ్మెల్యేలు యూ టర్న్..?

Defector MLAs U-turn..?

Loading

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి కరవమంటే కప్పు కోపం.. వద్దంటే పాముకు కోపం అన్నట్లు ఉందా..?. ఈ నెల 25న జరిగే సుప్రీం కోర్టు విచారణలో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారా..?. ఇప్పటికే అందిన నోటీసులతో ఆగమాగవుతున్న ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై రోజురోజుకి పెరుగుతున్న వ్యతిరేకతతో ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం అని ఫిక్స్ అయ్యారా..?. అందుకే సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తాము కాంగ్రెస్ లో చేరలేదని వాంగ్మూలం ఇచ్చారా..? అంటే అవుననే తెలుస్తుంది.

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పఠాన్ చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను.. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని అనేక సార్లు కలిశాను.. ఓ ప్రజాప్రతినిధిగా ఎవర్ని అయిన కలిసే హక్కు ఉంది కాబట్టి నేను మంత్రులను సైతం కలుస్తున్నాను. అంతమాత్రాన నేను పార్టీ మారినట్లా.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకెళ్లి ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అంతమాత్రాన సీఎం కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరినట్లా..నేను కూడా అంతే..కొన్ని మీడియా ఛానెళ్లు..నేనంటే గిట్టని వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారు ..ఇప్పటికి నా క్యాంప్ ఆఫీసులో మాజీసీఎం..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో ఉంటుంది అని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు..

మరో ఎమ్మెల్యే గద్వాల్ కు చెందిన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన బండ్లకృష్ణమోహన్ రెడ్డి ఏకంగా నా ఫోటోలను కాంగ్రెస్ పార్టీ బ్యానెర్లలో..ఫ్లెక్సీలల్లో పెడితే నేనే స్వయంగా పీఎస్ లో కేసు పెట్టాను..నేను కాంగ్రెస్ లో చేరితే నేనేందుకు కేసు పెడ్తాను..ఇంకా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని బండ్ల కృష్ణ మోహాన్ రెడ్డి అఫిడవిట్ లో తెలిపారు.జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అయితే ఏకంగా నేను పార్టీ మారలేదు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని పేర్కొన్నారు.. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నేను అధికారక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గోంటున్నాను . కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గోంటే నేను పార్టీ మారినట్లు కదా అని రిప్లయ్ ఇచ్చారంట.

ఇంకోవైపు ఖైరతాబాద్ ,స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహారి తమపై అనర్హత వేటు పడటం ఖాయం అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇటీవల ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కడియం శ్రీహారి ఆహ్వనించి సుమారు ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేయించుకున్నారు..ఇప్పుడు అదే బాటలో దానం నాగేందర్ సైతం నడవనున్నారు. ఉప ఎన్నికలోస్తే పార్టీ మ్యానీయా ఎలాగు పని చేయదు. గత పదిహేను నెలలుగా కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది.ఈ పరిస్థితుల్లో పార్టీ పేరు కంటే సొంత ఎజెండాతో ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని వీరిద్దరూ ప్రణాళికలు రచిస్తున్నారు. మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినందుకు ఇటు ప్రజల్లో అటు బీఆర్ఎస్ క్యాడర్ లో పీకల్లోతు కోపంతో పాటు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం. అందుకే పార్టీ మారలేదని అఫిడవిట్ లో తెలిపినట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *