ఆత్మహత్య చేసుకున్న రైతుకు అండగా బీఆర్ఎస్

 ఆత్మహత్య చేసుకున్న రైతుకు అండగా బీఆర్ఎస్

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం..బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాలతో మృతి చెందిన రైతు బోజేడ్ల ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ ని కలిసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం…

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం రైతు బోజేడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని మృతిని కుటుంబానికి సర్వత న్యాయం చేయాలని ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారికి వినతి పత్రం అందజేసి విన్నవించారు..

విన్నవించిన వారిలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం సభ్యులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,జడ్పీ చైర్మన్,నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్, MLC & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *