రేవంత్ పై BRS నేత సెటైర్లు

 రేవంత్ పై BRS నేత సెటైర్లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై BRS కి చెందిన యువనేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆడురిపోయే సెటైర్లు వేశారు. అయన మీడియా తో మాట్లాడుతూ

తెలంగాణ లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  కేవలం పీఆర్ స్టంట్లు, దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు కనపడటంలేదు.

రాష్ట్రంలో నిరుద్యోగులు, అంగన్వాడీలు,
ఆశ వర్కర్లు, గురుకుల టీచర్లు అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. కొన్ని నెలలుగా జీఓ46 బాధితులు కొన్ని నెలలుగా సెక్రటేరియట్ చుట్టూ కాళ్లకి చెప్పులు అరిగేలాగ తిరుగుతున్న కూడా కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుండా కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు

వాళ్లని కాలనివ్వడం లేదు కాబట్టి.. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా నేను వాళ్ల పక్షాన బీఆర్ఎస్ తరపున సీఎస్ ని కలిసి వాళ్ల గోడు వినిప్ధమని వాళ్లకి వినతి పత్రం అందచేదామని గత పది రోజులుగా మా పార్టీ ఆఫీస్ నుండి ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసిన, ఎన్ని సార్లు కాల్ చేసినా, ఎన్ని సార్లు అఫీషియల్ గా లెటర్ పంపిన కనీసం స్పందించలేదని అయన ఫైర్ అయ్యారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *