సొంత ఇలాఖాలో మంత్రి సీతక్కకు షాక్..?

 సొంత ఇలాఖాలో మంత్రి సీతక్కకు షాక్..?

Loading

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క @దనసరి అనసూయ తనొక ఫైర్ బ్రాండ్ నక్సలైట్ గా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో ఒక సెన్సెషన్ గా నిలిచింది ఆమె.సమ్మక్క సారలమ్మ పుట్టిన ములుగు జిల్లాలో జన్మించి సామాన్య మహిళ నుండి రాష్ట్ర స్థాయి మంత్రి వరకు ఎదిగింది ఆమె.రాజకీయాల్లో ఆమెకు తిరుగులేదనే చెప్పవచ్చు.కానీ అదికారంలోకి వచ్చాక ఆమె పూర్తిగా నియోజకవర్గాన్ని విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి..

ఇటివల నియోజకవర్గంలో దొడ్ల గ్రామం వద్ద నూతన బ్రిడ్జి కోసం మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసమైంది..10 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి పనులు మొదలు కాకపోవడంతో స్థానిక గ్రామస్తులే సీతక్కపై ఆగ్రహంతో ఈ పని చేసి ఉంటారని చర్చ జరుగుతుంది..ములుగు – ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం ఆవిష్కరించిన ఈ శిలాఫలకం ద్వంసమవటం చర్చానీయంశంగా మారింది.

.గతేడాది మార్చి 16న రూ.9.50లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మించేందుకు శిలాఫలకం ఏర్పాటు చేశారు. అయితే 10 నెలలు గడుస్తున్నా నేటి వరకు ఎలాంటి పనులను చేపట్టలేదు.. ఇదిలా ఉండగా సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం సైతం ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది.ఇది అపోజిషన్స్ పనా..? లేక మావోయిస్టులు ఆగ్రహంతో శిలాఫలకం ద్వంసం చేసారా అనేది తెలియాల్సింది.ములుగును ఏకపక్షంగా రాజకీయాలు నడిపిన సీతక్కకి ఇలాంటి చర్యలు కాస్త కలవరానికి గురిచేస్తాయనటంలో సందేహం లేదు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *