గేమ్ ఛేంజర్ ప్రీ రీలీజ్ ఈవెంట్ వెనక భారీ స్కెచ్..?

ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాతగా..గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా ..కియారా అద్వానీ హీరోయిన్ గా.. శ్రీకాంత్,ఎస్ జే సూర్య ,అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఈనెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటికే ఏపీలో ఈచిత్రానికి టికెట్ల ధరల పెంపుకు..బెనిఫిట్ షోలకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది..తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచింగ్ మాత్రం కేవలం నాలుగుగోడల మధ్య అంటే AMB మాల్ లో తెలంగాణలో విడుదల చేశారు.
.కానీ ప్రీ రీలీజ్ ఈవెంట్ మాత్రం ఏపీలో రాజమండ్రి లో ఘనంగా నిర్వహిస్తున్నారు..ఈ విషయంపై ఇటు తెలంగాణ రాజకీయ విశ్లేషకులు,తెలంగాణ వాదులు కేవలం హైదరాబాద్ బ్రాండ్ ను..తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీయడానికే ఇలా ప్లాన్ చేశారని విమర్శిస్తున్నారు..మీరు ఓ లుక్ వేయండి.. ఈ విషయం గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 మూవీ ప్రీరీలీజ్ రోజున హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఎపిసోడ్ను అడ్డం పెట్టుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలను కమాండ్ సెంటర్కు రప్పించుకొని, ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే మీటింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హంగామా అంతా ఉత్తదేనా?..
అది ఉత్తది కాకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్, సెన్సేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో వస్తున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు ఆంధ్ర ప్రదేశ్లో జరుపుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు..హైదరాబాద్లో చాలా గ్రాండ్గా ప్లాన్ చేసిన ట్రైలర్ రిలీజ్ చాలా సింపుల్ గా AMB థియేటర్లో స్క్రీనింగ్ వేసి మమ అనిపించేసారు? ఎందుకు?..హైదరాబాద్లో జరగాల్సిన ఈవెంట్ రాజమండ్రికి ఎందుకు వెళ్ళింది? అని ఇటు సినీ పొలిటికల్ క్రిటిక్స్ తో పాటు తెలంగాణలోని చెర్రీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు..
తెలంగాణలో కొలువై ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి.. దిల్ రాజుకు ఇచ్చిన పెద్ద టాస్క్ ఇదేనా? అని ఈ సందర్భంగా క్వచన్ చేస్తున్నారు..ఇక్కడ ఈవెంట్లు అన్ని ఆంధ్రాలో పెట్టుకునేలా చేయడం కోసమే ఇదంతా చేసారా?..అనుకోకుండా జరిగిన ఒక సంఘటనతో దేశ వ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తినేలా ఒక 20 రోజులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డ్రామాతో ఇండస్ట్రీ పెద్దల్లో అభద్రతా భావం నిండింది అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ కావాలా?..తమ రాష్ట్రం బాగు కోసమే రేవంత్ చర్యలు పనికొచ్చాయ్ అనేది పసిగట్టారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తెలివిగా సమర్ధించారని..దిల్ రాజు సైతం సినిమా పుట్టిందే బెజవాడ..రానున్న రోజుల్లో ఆమరావతి సినిమా ఇండస్ట్రీకి రాజధానిగా మారుతుంది అని అన్నారు..ఆ తర్వాత సీఎం చంద్రబాబు సైతం ఇలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తున్నారు..హైదరాబాద్లో మొన్నామధ్య 6 సంవత్సరాల తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా దేవర ఫంక్షన్ జరిగితే ఔట్ డోర్ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటూ, ఈవెంట్ క్యాన్సల్ అయిందని ఆయన అభిమానుల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుకు చేసుకుంటున్నారు.
అంతెందుకు అసలు మాకు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు పెద్ద మ్యాటర్ కాదని తెలంగాణలో చెప్పిన దిల్ రాజు, ఆంధ్ర ప్రదేశ్లో ఈవెంట్ పెట్టడం, అక్కడ టికెట్ రేట్లు హైక్, బెనిఫిట్ షో పర్మిషన్ తెచ్చుకోవడం దేనికి సంకేతం? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు..పరోక్షంగా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లేలా రేవంత్ చర్యలు తోడ్పడ్డాయి అందంలో సందేహం లేదు!!ఒక్క ఇండస్ట్రీ విషయంలోనే కాదు, ఈ మధ్య వరుసగా డ్రగ్స్ నిర్మూలన పేరుతో ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ పై కూడా చేసిన కామెంట్లు హైదరాబాద్ బ్రాండ్ పై నెగటివ్ ఇంపాక్ట్ పడింది.రీసెంట్గా సింగర్ & యాక్టర్ దిల్జీత్ దొసాంజ్కి నోటీసులు ఇవ్వడం, దానికి దిల్జీత్ సెటైర్లు, సింగర్ హనీ సింగ్ నేషనల్ మీడియాలో వేసిన కౌంటర్లు హైదరాబాద్ ప్రెసెంట్ సిట్యువేషన్ పై జోకులు వేసుకునే లెవల్కి తెచ్చాయని వారు ఆరోపిస్తున్నారు..
