వైసీపీకి మరో షాక్

 వైసీపీకి మరో షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ  సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్సీ  డొక్కా మాణిక్య వరప్రసాద్..

దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఆయన త్వరలో వైసీపీ రాజీనామా చేసి,టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరతారని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ఎమ్మెల్సీ డొక్కా మాత్రం ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు..ఆయన ఏ పార్టీ వైపు చూడట్లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. డోక్కా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన  2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా  గెలిచారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *