మాజీ మంత్రి హారీశ్ పిటిషన్ పై తీర్పు వాయిదా..!

రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్డ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్రవు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువ రిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకు హరీశ్రావును అరెస్టు చేయరాదంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటా యని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ ఉత్త ర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రినాయుడు, న్యాయవాది ఆర్ చంద్రశేఖర్రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ.. చక్ర ధర్ గౌడ్ తరపున ప్రభుత్వం వకాల్తా తీసుకున్నట్టుగా వాదనలు ఉన్నాయని తప్పుపట్టారు.
కేసు దర్యాప్తు అధికారి ఎడాపెడా అరెస్ట్ చేసి నిందితులను భయ భ్రాంతులకు గురిచేశారని, వాళ్లను భయపెట్టి బలవంతంగా తమకు కావాల్సిన రీతిలో వాంగ్మూలాలు తీసుకొని ఈ కేసులో హరీశ్రావును ఇరికించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. చక్రధర్ గౌడ్పై లైంగికదాడి సహా మొత్తం 11 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఆ కేసులు తప్పుగా నమోదైనవో, కాదో తేల్చాల్సింది కోర్టులని, కానీ ప్రభుత్వమే అవి తప్పుడు కేసులు అంటున్నదని చెప్పారు. ప్రాసిక్యూ షన్ రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నదని తెలి పారు. చక్రధర్ గౌడ్ తన ఎన్నికల అఫిడవిట్లలో సొమ్ము లేదని పేర్కొన్నారని, తరువాత ట్రస్ట్ పేరుతో నిధులు పంపిణీ చేశారంటున్నారు..
ఈ బాగోతంపై ఆదాయపు పన్ను శాఖతో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాజకీయ ప్రతీ కారం తీర్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న దని చెప్పారు. చక్రధర్ గౌడ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో తనపై నమోదైన పలు కేసులను కోర్టు కొట్టేసిందని, కొన్ని కేసుల్లో స్టే ఉత్త ర్వులు ఉన్నాయని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ లక్ష్మణ్ ప్రకటించారు. ఇదే కేసులో రెండో నిందితుడు రిటైర్డ్ పోలీస్ అధికారి రాధాకిషన్రావు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేస్తా మని వెల్లడించారు.
