డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్..?

Pawan Kalyan with the actor..!
మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ సంస్థకు సంబంధించి మాచవరం, దాచేపల్లి మండలాల్లో ఉన్న భూములను సర్వే చేయించాలి..ఈ భూముల్లో ఏమైన అటవీ శాఖకు సంబంధించినవి ఉంటే నివేదికలు ఇవ్వాలని జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక సంబంధితాధికారులను ఆదేశించిన సంగతి తెల్సిందే. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన తాహసిల్దార్ క్షమారాణి సంచలనాత్మకమైన నివేదికను అందజేశారు.
పర్యటించిన అనంతరం ఎమ్మార్వో క్షమారాణి మాట్లాడుతూ”డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సరస్వతి సంస్థకు భూములు పరిశీలించాము.ఏ ఏ గ్రామాల్లో ఎంత భూమి ఉందో పరిశీలించాము.మాచవరం మండలంలో మూడు గ్రామాల్లో సరస్వతి పవర్ సంస్థకు భూములు ఉన్నాయి.ఇవన్నీ పట్టా భూములే ఉన్నాయి.
చెన్నై పాలెం లో 272.96 ఎకరాలు ,పిన్నెల్లిలో 93.79 ఎకరాలు, వేమవరంలో 710.63 ఎకరాలు ఉన్నట్లు గుర్తించాము. అయితే ఈ మొత్తం 1073.38 ఎకరాలు అంతా కూడా పట్టా భూములే.ఈభూముల్లో చెరువులు గాని కుంటలుగాని వాగులు గాని వంకలు గాని వాటర్ షెడ్స్ కానీ ఏమీ లేవు. అడవులకు సంబంధించినవి ఏమి లేవు.ప్రభుత్వ భూమి పిన్నెల్లి లో 2.87 ఎకరాలు, వేమవరంలో 1.44 ఎకరాలు, మొత్తం కలిపి4.31 ఎకరాల భూములు ఉన్నాయి.వీటిని సదరు సంస్థ తీసుకోలేదు అని అన్నారు.
