ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు

andhrapradesh cm chandrababu
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడులతో సహా పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. ఆ పార్టీ నేతలు హాజరయ్యారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..దాదాపు నలబై ఏండ్లుగా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు అని అన్నారు..
ఆయన ఇంకా మాట్లాడుతూ టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు.. నేను ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచాను.. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే అని అన్నారు.
