యాట్రిస్‌ ఫార్మా సంస్థ భారీ విరాళం

 యాట్రిస్‌  ఫార్మా సంస్థ భారీ విరాళం

Revanth Reddy Telangana CM

Loading

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం అందించే కార్యక్రమానికి ప్రఖ్యాత వయాట్రిస్‌ (Viatris) ఫార్మా సంస్థ తమ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.6.4కోట్లు విరాళంగా ఇచ్చింది.

హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లోని 28వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు రెండు సంస్థల మధ్య అవగాన ఒప్పందం (MoU) కుదిరింది.

వయాట్రిస్ సీఎస్ఆర్ విభాగం బాధ్యురాలు మిచెల్ డొమినికా గారు, హెచ్‌కెఎమ్ ఛారిటబుల్ ఫౌండేషన్ సీఈవో కౌంతేయ దాస గారు పరస్పరం ఎంవోయూ ప‌త్రాలు మార్చుకున్నారు. సీఎస్ఆర్ వ్యవహారాలు పర్యవేక్షించే T-SIG విభాగం హెడ్ అర్చన సురేశ్ గారు, కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ (KADA) ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *