లక్ష్మీ పార్వతికి బిగ్ షాక్

The TDP government gave a big shock to Lakshmi Parvathi
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు అయిన శ్రీమతి లక్ష్మీ పార్వతికి టీడీపీ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది..
అందులో భాగంగా ప్రస్తుతం లక్ష్మీ పార్వతికి ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరించుకుంటున్నట్లు ఆ యూనివర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ కిశోర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రా యూనివర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యతను లక్ష్మీ పార్వతికి కేటాయించారు.
తాజాగా ఆ బాధ్యతను తెలుగు విభాగంలో మరొకరికి అప్పగించినట్లు కిషోర్ బాబు వెల్లడించారు. అంతేకాకుండా లక్ష్మీపార్వతికి ఇప్పటివరకు వర్సిటీ నుంచి జీతం చెల్లించలేదని అయన స్పష్టం చేశారు.
