అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్

 అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్

2 total views , 1 views today

దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. ప్రముఖ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)’ అనే సంస్థ దేశంలోని ప్రాంతీయ పార్టీల రాబడి వ్యయాల గురించి చేసిన ఓ సర్వేలో దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది.

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల రాబడి రూ.1740.48 కోట్లుగా ఉంటే ఒక్క గులాబీ పార్టీ ఆదాయమే రూ.737.67 కోట్లు గా ఉండటం గమనార్హం! .. దాదాపు 42.38 శాతం సొమ్ములు బీఆర్‌ఎస్‌ వద్దే ఉండడం విశేషం.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రాంతీయ పార్టీల ఆదాయం, ఖర్చులపై విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2022-23కు గాను దేశంలోని 57 ప్రాంతీయ పార్టీల్లో 39 పార్టీలు సమర్పించిన ఆడిట్‌ రిపోర్టుల ఆధారంగా ఏడీఆర్‌ ఈ నివేదికను రూపొందించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400