ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) కన్నుమూశారు.
ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు ఆదివారం ఉదయం 5.45ని.లకు తుదిశ్వాస విడిచారు.
కాగా మాగంటి గోపినాథ్ మూడుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మాగంటి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.
