మాట మార్చిన మంత్రి కొండా సురేఖ..!

Minister Konda Surekha
సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులకు పైసలు ఇవ్వాల్సిందే . కానీ నేను అలా కాదు. నాకు ఏమి పైసలు వద్దు. పని చేయండి అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తాజాగా ఆ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్లారిటీచ్చారు. నేను ఇప్పటి కాంగ్రెస్ మంత్రుల గురించి కాదు, నేను మాట్లాడింది బీఆర్ఎస్ పాలనలో మంత్రుల గురించి మాట్లాడాను. అప్పటి పరిస్థితుల గురించి వివరించాను.
కావాలనే నా వ్యాఖ్యలను వక్రీకరించారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.. బీఆర్ఎస్ వాళ్లు కావాలనే ఇలా ఫేక్ ప్రచారం చేస్తున్నారని అని తాజాగా క్లారిటీచ్చారు.