మంత్రులెవరూ ప్రిపైర్ రావడం లేదు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులెవ్వరూ హోంవర్క్ చేయడంలేదు.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిలయ్యారని శాసనసభలో సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు. గురు వారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమగ్రంగా అమలు చేయాలని కోరారు.
కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఒకవైపు కేంద్రం నుంచి ఏపీ నిధులు రాబట్టుకుంటుంటే.. తెలంగాణ సర్కారు ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పోల వరానికి జాతీయ హోదా ఇవ్వడంతోపాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా టేకప్ చేశారని, కానీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీద కేంద్రా
నికి పట్టింపే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్ డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రా లకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈక్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక సమాఖ్యగా ఏర్పాటు కాబోతున్నాయని ఆయన స్పష్టంచేశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రతి జిల్లాకు వస్తుందని తెలిపారు. వైఎస్సార్ తోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని గుర్తుచే శారు. గ్లోబల్ కెపాబులిటీ సెంటర్, సెమికండ క్టర్ వంటి పరిశ్రమలు త్వరలో రాబోతున్నా యని ఆయన స్పష్టం చేశారు..
