వల్లభనేని వంశీపై మరో కేసు…!

Do you need an American visa?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయనపై గన్నవరం పోలీసులు నిన్న మంగళవారం భూకబ్జా కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో రూ. 10 కోట్ల విలువైన తన భూమిని కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది భార్య సుంకర సీతామహాలక్ష్మి పోలీసు లకు ఫిర్యాదు చేశారు.
వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో ఆమె కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు మరో 15 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు.
మరోవైపు వంశీ చేసిన అక్రమాలపై విచా రణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే వంశీకి నలువై పుల నుంచి ఉచ్చు బిగుసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
