సీఎం రేవంత్ రెడ్డి షాక్..?

తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో ముసలం రాజుకుందా..? ఓ మంత్రి తీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంచలన వార్త భయటకు వచ్చింది.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రగులుతున్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది.
అధికార పార్టీలో కలహాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి వల్ల సుమారు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. హైదరాబాదులోని ఓ ఫామ్ హౌస్ లో రహస్యంగా పదిమంది ఎమ్మెల్యేలు సమావేశమై చర్చించినట్లు తెలుస్తుంది..
క్యాబినెట్ లోని ఓ మంత్రి వ్యవహారం ఎమ్మెల్యేలను పట్టించుకోన్నట్టుగా ఉందని, తమను పట్టించుకోని పరిస్థితుల్లో తమ కార్యచరణ తాము రూపొందించుకుంటామని కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు ఓ ఫామ్ హౌస్ లో భేటీ అయినట్టు సమాచారం.. అందులో వరంగల్ నుంచి కొందరు, ఇతర ప్రాంతాల నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ అంటేనే కలహాలకు పెట్టింది పేరుగా ఉండేది..
కానీ ఒక ఏడాదికాలంగా కాంగ్రెస్ పార్టీలో సఖ్యతగా ఉండి పార్టీని నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలో ఓ మంత్రి తమకు నిధుల కేటాయింపులో గాని, ప్రాధాన్యత విషయంలో గాని పట్టించుకోవడంలేదని అదిష్టానం దృష్టికి తీసుకెల్లినా పట్టించుకోవటం లేదని వారు ఈ సమీవేశం ఏర్పాటు చేసినట్టు తమ సన్నుహితుల ద్వారా తెలిసింది.అయితే మరి ఈ ముసలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగిస్తారా..? అలిగిన ఎమ్మెల్యేలను బుజ్జగించి కథ సుఖాంతం చేస్తారా వేచి చూడాలి.